Telugu Global
Others

భ‌ర్త వెంటే తానూ తిరిగిరాని లోకాల‌కు...

క‌డ‌దాకా క‌లిసుంటాన‌ని బాస‌లు చేసిన భ‌ర్త అనారోగ్యంతో మ‌ర‌ణించ‌డాన్ని ఆ భార్య త‌ట్టుకోలేక పోయింది. దింపుడు క‌ళ్లెం ఆశ‌తో పాడె దించిన భ‌ర్త నోటిలో బంగార‌పు చెవి క‌మ్మ పెడుతూ నువ్వే పోయినాక నేను ఎవ్వ‌రి  కోసం బ‌త‌కాలే అంటూ కుప్ప‌కూలి ప్రాణాలు విడిచింది. విషాద‌క‌ర ఈ సంఘ‌ట‌న  క‌రీంన‌గ‌ర్ జిల్లా హుస్నాబాద్ మండ‌లం బుడిగ‌జంగాల కాల‌నీలో జ‌రిగింది. భ‌ర్త రాములు (65) అనారోగ్యంతో మ‌ర‌ణించ‌డాన్ని జీర్ణించుకోలేని భార్య వెంక‌మ్మ (60) అదేప‌నిగా రోదిస్తూ మృతి చెందింది.ఈ […]

క‌డ‌దాకా క‌లిసుంటాన‌ని బాస‌లు చేసిన భ‌ర్త అనారోగ్యంతో మ‌ర‌ణించ‌డాన్ని ఆ భార్య త‌ట్టుకోలేక పోయింది. దింపుడు క‌ళ్లెం ఆశ‌తో పాడె దించిన భ‌ర్త నోటిలో బంగార‌పు చెవి క‌మ్మ పెడుతూ నువ్వే పోయినాక నేను ఎవ్వ‌రి కోసం బ‌త‌కాలే అంటూ కుప్ప‌కూలి ప్రాణాలు విడిచింది. విషాద‌క‌ర ఈ సంఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ జిల్లా హుస్నాబాద్ మండ‌లం బుడిగ‌జంగాల కాల‌నీలో జ‌రిగింది. భ‌ర్త రాములు (65) అనారోగ్యంతో మ‌ర‌ణించ‌డాన్ని జీర్ణించుకోలేని భార్య వెంక‌మ్మ (60) అదేప‌నిగా రోదిస్తూ మృతి చెందింది.ఈ దంపతుల‌కు ఐదుగురు పిల్ల‌లు. ముగ్గురు కుమారులు, ఇద్ద‌రు కుమార్తెలు. త‌ల్లిదండ్రులు ఒకేసారి మ‌ర‌ణించ‌డంతో వారు శోక‌సంద్రంలో మునిగి పోయారు.
First Published:  13 Aug 2015 1:12 PM GMT
Next Story