Telugu Global
Others

పెనుకొండ ఆర్‌టిఓ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు

అనంతపురం జిల్లా పెనుకొండ ఆర్‌టిఓ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. చెక్‌పోస్టులో అనధికారంగా ఉన్న రూ.31,200తోపాటు పలు రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది తమ స్వలాభం కోసం ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని, ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూని ధారాదత్తం కింద వసూలు చేసుకుంటున్నారని జిల్లా ఏసీబీ అధికారులు విలేకరులకు వివరించారు. అసిస్టెంట్ మోటార్ ఇన్స్‌పెక్టర్ మీద కేసు పెట్టి విచారణ చేపడతామన్నారు.

అనంతపురం జిల్లా పెనుకొండ ఆర్‌టిఓ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. చెక్‌పోస్టులో అనధికారంగా ఉన్న రూ.31,200తోపాటు పలు రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది తమ స్వలాభం కోసం ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని, ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూని ధారాదత్తం కింద వసూలు చేసుకుంటున్నారని జిల్లా ఏసీబీ అధికారులు విలేకరులకు వివరించారు. అసిస్టెంట్ మోటార్ ఇన్స్‌పెక్టర్ మీద కేసు పెట్టి విచారణ చేపడతామన్నారు.
First Published:  13 Aug 2015 1:15 PM GMT
Next Story