త్రీ ఇడియట్స్ సినిమా డైరెక్టర్ కు గాయాలు..
బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి అంటే మన తెలుగు ఆడియన్స్ కు ఎక్కువ మందికి పేరు పరిచయం లేక పోవచ్చు. కానీ ఆయన చేసిన త్రీ ఇడియట్స్ , పీకే చిత్రాలు మాత్రం ఎక్కువ మందికి తెలుసు. ఈ రోజు ఉదయం ముంబాయిలో బైక్ పై వెళ్తుండగా రాజ్ కుమార్ హిరాణి బైక్ అదుపు తప్పి కింద పడ్డారు.వెంటనే ఆయన్ను ముంబాయిలోని లీలావతి హస్పటల్లో చేర్పించారు. ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపినట్లు […]
BY admin11 Aug 2015 3:58 AM GMT
X
admin Updated On: 11 Aug 2015 3:58 AM GMT
బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి అంటే మన తెలుగు ఆడియన్స్ కు ఎక్కువ మందికి పేరు పరిచయం లేక పోవచ్చు. కానీ ఆయన చేసిన త్రీ ఇడియట్స్ , పీకే చిత్రాలు మాత్రం ఎక్కువ మందికి తెలుసు. ఈ రోజు ఉదయం ముంబాయిలో బైక్ పై వెళ్తుండగా రాజ్ కుమార్ హిరాణి బైక్ అదుపు తప్పి కింద పడ్డారు.వెంటనే ఆయన్ను ముంబాయిలోని లీలావతి హస్పటల్లో చేర్పించారు. ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపినట్లు ఆయన సన్నిహితులు సమాచారం.
దర్శకుడిగా రాజ్ కుమార్ హరాణి చిత్రాలు ఆడియన్స్ కు వినోదాని పంచుతూనే .. ఆలోచింప చేసే పాయింట్స్ ను డీల్ చేయడంలో ఎక్స్ పర్ట్. పీకే చిత్రం లో దొంగ బాబాలు..అమాయకపు ప్రజల భయాన్ని ఎలా క్యాష్ చేసుకుంటున్నారు అనే పాయింట్ ను అమీర్ ఖాన్ తో చాల వ్యంగ్యంగా చూపించి బాక్సాఫీస్ రికార్డ్స్ ను కూడా కొల్ల గొట్టారు. తాజాగా మరో వైవిధ్యమైన కథను ఆయన సిద్దం చేసుకుంటున్నారు మరి.
Next Story