Telugu Global
Others

ఆపరేషన్ టేబుల్‌కు షాక్‌... బాలుడికి గాయాలు

కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. భీమవరానికి చెందిన గణేష్ అనే బాలుడికి ఆపరేషన్ చేస్తుండగా ఆ టేబుల్‌కు విద్యుత్‌షాక్‌ తగలడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆర్‌ఐసీయూకి గణేష్‌ని తరలించి చికిత్సనందిస్తున్నారు. ఆర్థోపెడిక్‌ ఆపరేషన్‌ థియేటర్‌లో విద్యుత్‌ షాక్‌పై గతంలోనే ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని డాక్టర్లు తెలిపారు. విద్యుత్‌షాక్‌ విషయాన్ని తెలుసుకున్న ఏపీ ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడి గణేష్‌కు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. భీమవరానికి చెందిన గణేష్ అనే బాలుడికి ఆపరేషన్ చేస్తుండగా ఆ టేబుల్‌కు విద్యుత్‌షాక్‌ తగలడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆర్‌ఐసీయూకి గణేష్‌ని తరలించి చికిత్సనందిస్తున్నారు. ఆర్థోపెడిక్‌ ఆపరేషన్‌ థియేటర్‌లో విద్యుత్‌ షాక్‌పై గతంలోనే ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని డాక్టర్లు తెలిపారు. విద్యుత్‌షాక్‌ విషయాన్ని తెలుసుకున్న ఏపీ ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడి గణేష్‌కు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
First Published:  10 Aug 2015 1:17 PM GMT
Next Story