నోటి దూల మంత్రి.. బూతు పురాణం!
అధికారులంటే తమ కింద బానిసలనుకుంటున్నట్టున్నారు ఓ తెలంగాణ మంత్రిగారు. . ఆయన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తారు. ఆయనకు, ఆయన నోటికి జడిసే అధికారులు తలదించుకుని పడి ఉంటారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఈ మంత్రిగారు… అధికారం కోసం ఇపుడు టీఆర్ఎస్లో చేరి అమాత్య పదవి దక్కించుకున్నారు. మంత్రి పదవి ఉంది కదా… నాకేంటి అనుకున్నట్టున్నారు ఈయన. దాంతో మంత్రిగారి నియంతృత్వంతో అధికారుల బానిసత్వం వర్ధిల్లుతోంది. అధికారి, ఉద్యోగి, మీడియా… ఎవరైతే […]
BY sarvi10 Aug 2015 5:42 AM GMT
X
sarvi Updated On: 10 Aug 2015 6:02 AM GMT
అధికారులంటే తమ కింద బానిసలనుకుంటున్నట్టున్నారు ఓ తెలంగాణ మంత్రిగారు. . ఆయన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తారు. ఆయనకు, ఆయన నోటికి జడిసే అధికారులు తలదించుకుని పడి ఉంటారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఈ మంత్రిగారు… అధికారం కోసం ఇపుడు టీఆర్ఎస్లో చేరి అమాత్య పదవి దక్కించుకున్నారు. మంత్రి పదవి ఉంది కదా… నాకేంటి అనుకున్నట్టున్నారు ఈయన. దాంతో మంత్రిగారి నియంతృత్వంతో అధికారుల బానిసత్వం వర్ధిల్లుతోంది. అధికారి, ఉద్యోగి, మీడియా… ఎవరైతే నాకేంటి అనుకుంటున్నారాయన. ఆయన బూతు పురాణానికి సాదాసీదా వ్యక్తులే కాదు… మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్… బలి కావాల్సిందే! నా నోరు… నాఇష్టం… అనేలా మంత్రిగారి బూతు పురాణం సాగుతోంది. ఆయన సిగ్గులేదా… నోర్ముయ్… వంటి అభ్యంతరకర వ్యాఖ్యలు, అసభ్యకర పదజాలం పక్కనున్న వాళ్ళని నివ్వెర పోయేట్టు చేస్తోంది. ఆత్మ గౌరవంతో సాధించుకున్న తెలంగాణలో ఖమ్మం జిల్లా అధికారుల బానిసత్వానికి ఆయన వ్యవహారశైలి ఓ ప్రతీక. ఇంతకీ ఆ మంత్రిగారెవరో తెలుసా?… ఆయనే తుమ్మల నాగేశ్వరరావు! ఆయన బూతుపురాణం వీడియో సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. విశేషమేమిటంటే ఆ మంత్రిగారు ఈ బూతులన్నింటిని ఒక వర్గపు మీడియా ముందు నిర్లజ్జగా మాట్లాడటం. ఆత్మగౌరవం కోసం పోరాడి ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్న ఉద్యోగుల ఆత్మగౌరవం ఈ బంగారు తెలంగాణాలో కేసీఆర్ ఏమేరకు కాపాడుతాడో చూడాలి…!
Next Story