జస్టిస్ దీపక్ మిశ్రాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం
జస్టిస్ దీపక్ మిశ్రాకు ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ సమకూర్చింది. 1993 ముంబై బాంబు పేలుళ్ళ కేసులో తీర్పు వెలువరించిన ముగ్గురు న్యాయమూర్తుల్లో దీపక్ మిశ్రా ఒకరు. ఈ కేసులో యాకూబ్ మెమెన్నకు గత నెల 30 న ఉరి వేసిన విషయం తెలిసిందే. ఉరి శిక్షను రద్దు చేయాలని కోరిన యాకూబ్ మెమెన్ పిటీషన్ను ధర్మాసనం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. తుది తీర్పును వెలువరించిన న్యాయమూర్తుల్లో దీపక్ మిశ్రా కూడా ఒకరు. ఎంత భద్రత ఏర్పాట్లు […]
BY sarvi7 Aug 2015 1:14 PM GMT
X
sarvi Updated On: 8 Aug 2015 5:59 AM GMT
జస్టిస్ దీపక్ మిశ్రాకు ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ సమకూర్చింది. 1993 ముంబై బాంబు పేలుళ్ళ కేసులో తీర్పు వెలువరించిన ముగ్గురు న్యాయమూర్తుల్లో దీపక్ మిశ్రా ఒకరు. ఈ కేసులో యాకూబ్ మెమెన్నకు గత నెల 30 న ఉరి వేసిన విషయం తెలిసిందే. ఉరి శిక్షను రద్దు చేయాలని కోరిన యాకూబ్ మెమెన్ పిటీషన్ను ధర్మాసనం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. తుది తీర్పును వెలువరించిన న్యాయమూర్తుల్లో దీపక్ మిశ్రా కూడా ఒకరు. ఎంత భద్రత ఏర్పాట్లు చేసుకున్నా చంపేస్తామని బెదిరింపులు లేఖ రావడంతో ప్రభుత్వం ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇందులో భాగంగా విచారణ వేగిరం చేసిన పోలీసులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయనకు ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చారు.
Next Story