రాష్ట్రపతి సతీమణి పరిస్థితి విషమం
రాష్ట్రపతి సతీమణి సువ్రా ముఖర్జీ అనారోగ్యానికి గురయ్యారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అధికారవర్గాల సమాచారం. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. శుక్రవారం నుంచి ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్చారు. మొదట్లో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ శనివారం ఉదయం ఆమె ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు చెప్పారు. ఐసీయూలో ఆమెకు ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒడిషా […]
BY sarvi7 Aug 2015 1:13 PM GMT
X
sarvi Updated On: 8 Aug 2015 6:06 AM GMT
రాష్ట్రపతి సతీమణి సువ్రా ముఖర్జీ అనారోగ్యానికి గురయ్యారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అధికారవర్గాల సమాచారం. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. శుక్రవారం నుంచి ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్చారు. మొదట్లో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ శనివారం ఉదయం ఆమె ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు చెప్పారు. ఐసీయూలో ఆమెకు ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒడిషా పర్యటనను ముగించుకొని న్యూఢిల్లీ చేరుకున్నారు.
Next Story