ఇంతకీ రుణమాఫీ అయ్యిందా.. లేదా?
మూడోవిడత మాఫీపై గందరగోళం ఆంధ్ర ప్రదేశ్లో రైతు రుణమాఫీపై తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న గందరగోళం ఇంకా కొనసాగుతోంది. రుణమాఫీ జరిగిపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న తెలుగుదేశం ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత పెల్లుబుకుతున్నది. ఇప్పటికి రెండు సార్లు రుణమాఫీ జరిగిందని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా ఆచరణలో ఒరిగింది కొద్దిమంది రైతులకు మాత్రమే. అది కూడా అరకొరగానే. ఇపుడు మూడో విడత రుణమాఫీ జరిగిపోయిందని కూడా వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు నాలుగురోజుల కిందట ప్రకటించారు. మూడో విడత […]
BY sarvi8 Aug 2015 12:07 AM GMT
X
sarvi Updated On: 8 Aug 2015 12:07 AM GMT
మూడోవిడత మాఫీపై గందరగోళం
ఆంధ్ర ప్రదేశ్లో రైతు రుణమాఫీపై తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న గందరగోళం ఇంకా కొనసాగుతోంది. రుణమాఫీ జరిగిపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న తెలుగుదేశం ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత పెల్లుబుకుతున్నది. ఇప్పటికి రెండు సార్లు రుణమాఫీ జరిగిందని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా ఆచరణలో ఒరిగింది కొద్దిమంది రైతులకు మాత్రమే. అది కూడా అరకొరగానే. ఇపుడు మూడో విడత రుణమాఫీ జరిగిపోయిందని కూడా వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు నాలుగురోజుల కిందట ప్రకటించారు. మూడో విడత రుణమాఫీ పూర్తి చేశాం అని ప్రకటించారు. అయితే వాస్తవానికి ఆ ప్రక్రియ అసలు ప్రారంభం కాకముందే మంత్రి అలా ప్రకటించేశారని ఆ తర్వాత అర్ధమయ్యింది. ఎందుకంటే మంత్రి ప్రకటించిన నాలుగురోజుల తర్వాత వెబ్సైట్లో లబ్దిదారుల జాబితా వెలుగుచూసింది. జాబితాను వెబ్సైట్లో కూడా పెట్టేశామని మంత్రి మంగళవారం ప్రకటించారు. అయితే శుక్రవారం సాయంత్రం వరకు ఆ జాబితా వెబ్సైట్లో లేదు. ఆ విషయం ఎలాగో మంత్రిగారికి తెలియడంతో ఆయన హడావిడిగా ఆ తంతు పూర్తి చేయించారు. శుక్రవారం సాయంత్రానికి జాబితాను వెబ్సైట్లో పెట్టారు. రుణమాఫీకి అర్హత ఉన్నప్పటికీ పాస్పుస్తకం వంటి పత్రాలు సమర్పించక మాఫీ పొందలేకపోయిన వారికి మరో అవకాశం ఇవ్వడంతో 5.11 లక్షల అభ్యర్థలకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిల్లో 2.73 లక్షల దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించి రు.894 కోట్లు అవసరమని లెక్క తేల్చారు. ఇందులో తొలివిడతగా రు.380 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేసినట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఇస్తానన్న లక్షన్నర రూపాయలలో తొలివిడత మాఫీ పోను మిగతా మొత్తానికి బాండ్లు ఇస్తామని ప్రకటించి ఇప్పటికి 8 నెలలు గడిచాయి. అయినా వాటి ఊసే లేదు.
Next Story