Telugu Global
Others

చిట్టీల పేరుతో రూ.10 కోట్లతో ఉడాయించిన మహిళ

మెదక్ జిల్లాలోని బీహెచ్ఈఎల్ ఎల్ఐజీ కాలనీలో చిట్టీల పేరుతో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. దాదాపు రూ. 10 కోట్లతో ఉడాయించిన వైనం వెలుగుజూసింది. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మహేశ్వరి అనే మహిళ ఎల్ఐజీ కాలనీలో గత కొంతకాలంగా నివాసముంటోంది. అయితే కాలనీలో తనకున్న పరిచయాలతో చిట్టీలను ప్రారంభించింది. ఇలా మొత్తం దాదాపు రూ. 10 కోట్ల మేరకు వసూలు చేసిన ఆమె కనిపించకుండా పోవడంతో చిట్టీలు వేసిన వారు లబోదిబోమంటున్నారు.

మెదక్ జిల్లాలోని బీహెచ్ఈఎల్ ఎల్ఐజీ కాలనీలో చిట్టీల పేరుతో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. దాదాపు రూ. 10 కోట్లతో ఉడాయించిన వైనం వెలుగుజూసింది. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మహేశ్వరి అనే మహిళ ఎల్ఐజీ కాలనీలో గత కొంతకాలంగా నివాసముంటోంది. అయితే కాలనీలో తనకున్న పరిచయాలతో చిట్టీలను ప్రారంభించింది. ఇలా మొత్తం దాదాపు రూ. 10 కోట్ల మేరకు వసూలు చేసిన ఆమె కనిపించకుండా పోవడంతో చిట్టీలు వేసిన వారు లబోదిబోమంటున్నారు.
First Published:  4 Aug 2015 1:05 PM GMT
Next Story