Telugu Global
Others

బ్లాక్‌ డే గురించి సోనియా మాటలా: జేసీ

సోనియాకు బ్లాక్‌డే గురించి మాట్లాడే అర్హత లేదని…పార్లమెంటు తలుపులు మూసి ఏపీని విభజించిన రోజే దేశానికి బ్లాక్‌ డే వచ్చిందని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎంపీల సస్పెన్షన్‌పై సోనియా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు సోనియా శాశ్వత సమాధి కట్టారని ఆరోపించారు. వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ ఎన్నడూ ఇంత దయనీయస్థితికి చేరలేదని, కాంగ్రెస్‌ వల్లే ఆంధ్రప్రదేశ్‌కు కష్టాలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ వల్లే కాంగ్రెస్‌ దిగజారిపోయిందన్నారు. ఎంపీలను సస్పెండ్‌ […]

సోనియాకు బ్లాక్‌డే గురించి మాట్లాడే అర్హత లేదని…పార్లమెంటు తలుపులు మూసి ఏపీని విభజించిన రోజే దేశానికి బ్లాక్‌ డే వచ్చిందని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎంపీల సస్పెన్షన్‌పై సోనియా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు సోనియా శాశ్వత సమాధి కట్టారని ఆరోపించారు. వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ ఎన్నడూ ఇంత దయనీయస్థితికి చేరలేదని, కాంగ్రెస్‌ వల్లే ఆంధ్రప్రదేశ్‌కు కష్టాలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ వల్లే కాంగ్రెస్‌ దిగజారిపోయిందన్నారు. ఎంపీలను సస్పెండ్‌ చేస్తే బ్లాక్‌ డే అంటున్నారు…మరి రాష్ర్టాన్ని విభజించిన మిమ్మల్ని ఏమనాలని జేసీ ప్రశ్నించారు.
First Published:  4 Aug 2015 1:20 PM GMT
Next Story