Telugu Global
Others

రూ.5 లక్షల పరిహారమివ్వాలి: కోదండరాం

పంటలు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరామ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రైతులను రుణ విముక్తులను చేయాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, బ్యాంకుల ద్వారా రుణాలు సకాలంలో అందజేయాలన్నారు. ప్రకృతి వైఫరిత్యాల వల్ల ఎవరైనా రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 […]

పంటలు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరామ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రైతులను రుణ విముక్తులను చేయాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, బ్యాంకుల ద్వారా రుణాలు సకాలంలో అందజేయాలన్నారు. ప్రకృతి వైఫరిత్యాల వల్ల ఎవరైనా రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆయన కోరారు.
First Published:  3 Aug 2015 1:21 PM GMT
Next Story