Telugu Global
Others

త్వరలో డీలర్లకు కమీషన్‌ పెంపు : సునీత

త్వరలో రేషన్‌ డీలర్లకు కమీషన్లను పెంచే అవకాశం ఉందని పౌర సరాఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. కష్ణాజిల్లా నందిగామలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత రేషన్‌కు అదనంగా రాగులు ఇస్తామని తెలిపారు. వలస కార్మికులకు రేషన్‌ ప్రతి నెలా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్‌ కార్డుల్లేని అర్హులకు త్వరలో కొత్తవి ఇస్తామన్నారు. వృద్ధులు, వికలాంగులు ఈ పాస్‌ల ద్వారా రేషన్‌ తీసుకోలేకపోతే వారికి మ్యానువల్‌గా అందిస్తామన్నారు. అనంతరం మంత్రి సుజాత గుంటూరు వెళ్లి అక్కడ రైతు […]

త్వరలో రేషన్‌ డీలర్లకు కమీషన్లను పెంచే అవకాశం ఉందని పౌర సరాఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. కష్ణాజిల్లా నందిగామలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత రేషన్‌కు అదనంగా రాగులు ఇస్తామని తెలిపారు. వలస కార్మికులకు రేషన్‌ ప్రతి నెలా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్‌ కార్డుల్లేని అర్హులకు త్వరలో కొత్తవి ఇస్తామన్నారు. వృద్ధులు, వికలాంగులు ఈ పాస్‌ల ద్వారా రేషన్‌ తీసుకోలేకపోతే వారికి మ్యానువల్‌గా అందిస్తామన్నారు. అనంతరం మంత్రి సుజాత గుంటూరు వెళ్లి అక్కడ రైతు బజారును పరిశీలించారు.
First Published:  2 Aug 2015 1:14 PM GMT
Next Story