Telugu Global
Others

నెలాఖరులో 'బరాక్-8' క్షిపణి పరీక్ష

భారత్‌, ఇజ్రాయిల్ దేశాలు కలిసి, ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించేలా అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక ‘బరాక్-8’ క్షిపణిని ఈ నెలాఖరులో పరీక్షించనున్నారు. శత్రుదేశపు క్షిపణులు, విమానాలు, డ్రోన్ల నుంచి యుద్ధ నౌకలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో బరాక్ క్షిపణుల తయారీని ఇండియా ప్రారంభించిన సంగతి తెలిసిందే. బరాక్ శ్రేణిలో ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నది 8వ తరం క్షిపణి. ఇజ్రాయిల్‌లో క్షిపణి పరీక్షలు జరగనుండగా, అవి విజయవంతమైనతే సెప్టెంబరులో భారత జలాల్లో యుద్ధనౌకపై నుంచి ‘బరాక్-8’కు తుది […]

భారత్‌, ఇజ్రాయిల్ దేశాలు కలిసి, ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించేలా అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక ‘బరాక్-8’ క్షిపణిని ఈ నెలాఖరులో పరీక్షించనున్నారు. శత్రుదేశపు క్షిపణులు, విమానాలు, డ్రోన్ల నుంచి యుద్ధ నౌకలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో బరాక్ క్షిపణుల తయారీని ఇండియా ప్రారంభించిన సంగతి తెలిసిందే. బరాక్ శ్రేణిలో ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నది 8వ తరం క్షిపణి. ఇజ్రాయిల్‌లో క్షిపణి పరీక్షలు జరగనుండగా, అవి విజయవంతమైనతే సెప్టెంబరులో భారత జలాల్లో యుద్ధనౌకపై నుంచి ‘బరాక్-8’కు తుది పరీక్షలు జరపాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
First Published:  2 Aug 2015 1:11 PM GMT
Next Story