Telugu Global
NEWS

టీఆర్‌ఎస్‌ పాలనపై కోదండరాం కన్నెర్ర

తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రొఫెసర్ జయశంకర్‌ 81వ జయంతి రోజు (ఆగస్టు 6)న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతామని కొదండరాం తెలిపారు. హైదరాబాద్‌లో తెలంగాణ పోలిటికల్ జేఏసీ సమావేశం ముగిసిన తర్వాత సమావేశ తీర్మానాలను కొదండరాం మీడియాకు తెలిపారు. ఈనెల 3న ఉస్మానియా ఆస్పత్రిని సందర్శిస్తామన్నారు. ఆ తర్వాత మా నిర్ణయం చెబుతామని కోదండరామ్‌ అన్నారు. గోదావరి జలాల వినియోగం, హైకోర్టు విభజన, ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల విభజనపై చర్చించామన్నారు. ఉద్యోగులు, ఆస్తుల విభజన […]

టీఆర్‌ఎస్‌ పాలనపై కోదండరాం కన్నెర్ర
X
తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రొఫెసర్ జయశంకర్‌ 81వ జయంతి రోజు (ఆగస్టు 6)న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతామని కొదండరాం తెలిపారు. హైదరాబాద్‌లో తెలంగాణ పోలిటికల్ జేఏసీ సమావేశం ముగిసిన తర్వాత సమావేశ తీర్మానాలను కొదండరాం మీడియాకు తెలిపారు. ఈనెల 3న ఉస్మానియా ఆస్పత్రిని సందర్శిస్తామన్నారు. ఆ తర్వాత మా నిర్ణయం చెబుతామని కోదండరామ్‌ అన్నారు. గోదావరి జలాల వినియోగం, హైకోర్టు విభజన, ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల విభజనపై చర్చించామన్నారు. ఉద్యోగులు, ఆస్తుల విభజన ఆలస్యంపై నిరసన వ్యక్తం చేశారు.
First Published:  2 Aug 2015 12:22 AM GMT
Next Story