ఇప్పటికీ ట్యాపింగ్లోనే ఫోన్లు: ఎర్రబెల్లి
తెలంగాణ ప్రభుత్వంలో కీలక హోదాలో ఉండి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి తెలంగాణ ప్రజల గౌరవాన్ని సీఎం కేసీఆర్ మంట గలిపారని టీ.టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. ఇప్పటికీ తమ ఫోన్లు ట్యాప్ అవుతునే ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవమేనని హైకోర్టులోనే ఒప్పుకున్నందున నిజంగా కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే… తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ చర్యల వల్ల హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు […]
BY Pragnadhar Reddy31 July 2015 1:09 PM GMT
Pragnadhar Reddy Updated On: 31 July 2015 9:34 PM GMT
తెలంగాణ ప్రభుత్వంలో కీలక హోదాలో ఉండి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి తెలంగాణ ప్రజల గౌరవాన్ని సీఎం కేసీఆర్ మంట గలిపారని టీ.టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. ఇప్పటికీ తమ ఫోన్లు ట్యాప్ అవుతునే ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవమేనని హైకోర్టులోనే ఒప్పుకున్నందున నిజంగా కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే… తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ చర్యల వల్ల హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నారని ఎర్రబెల్లి అన్నారు.
Next Story