ఏపీ ఎంపీలు రాజీనామాకు సీపీఐ డిమాండ్
ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇచ్చేది లేదని లోక్సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతుంటే ఏపీ ఎంపీలు ఎందుకు నోరు మెదపలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రేపటి నుంచి బస్సు యాత్ర చేస్తామని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదాపై ఆగస్టు 9 వరకు వేచి చూస్తామని, కేంద్రం నుంచి ప్రకటన రాకపోతే […]
BY Pragnadhar Reddy31 July 2015 1:08 PM GMT
Pragnadhar Reddy Updated On: 31 July 2015 9:31 PM GMT
ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇచ్చేది లేదని లోక్సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతుంటే ఏపీ ఎంపీలు ఎందుకు నోరు మెదపలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రేపటి నుంచి బస్సు యాత్ర చేస్తామని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదాపై ఆగస్టు 9 వరకు వేచి చూస్తామని, కేంద్రం నుంచి ప్రకటన రాకపోతే ఆగస్టు 11న ఏపీ బంద్కు పిలుపు ఇస్తామని రామకృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Next Story