Telugu Global
Others

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: ఎంపీ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఢిల్లీలో మాట్లాడారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించిందని, అందువల్లే ఆంధ్రప్రదేశ్ 16 వేల కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలన్నా, నూతన రాజధాని నిర్మించుకోవాలన్నా ప్రత్యేక హోదా తప్పనిసరని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఢిల్లీలో మాట్లాడారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించిందని, అందువల్లే ఆంధ్రప్రదేశ్ 16 వేల కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలన్నా, నూతన రాజధాని నిర్మించుకోవాలన్నా ప్రత్యేక హోదా తప్పనిసరని ఆయన అన్నారు.
First Published:  30 July 2015 1:20 PM GMT
Next Story