Telugu Global
Others

పుష్కరాలకు వెళ్లేందుకు సండ్రకు అనుమతి

టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు పుష్కరాలకు వెళ్లేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు గురువారం అనుమతించింది. 26వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు పుష్కరాల స్నాన, దర్శన కార్యక్రమాన్ని ముగించుకుని ఆ తర్వాత నియోజకవర్గంలోనే ఉండాలని ఆదేశించింది. టీటీడీ బోర్డు సభ్యునిగా ఉన్న తనకు తిరుమల వెళ్లేందుకు కూడా అనుమతించాలని సండ్ర ఏసీబీ కోర్టును కోరారు. దీనిపై సోమవారం కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని కోర్టు ఆదేశించింది. పుష్కరాలకు వెళ్ళేందుకు తమకు అభ్యంతరం లేదని ఏసీబీ […]

టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు పుష్కరాలకు వెళ్లేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు గురువారం అనుమతించింది. 26వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు పుష్కరాల స్నాన, దర్శన కార్యక్రమాన్ని ముగించుకుని ఆ తర్వాత నియోజకవర్గంలోనే ఉండాలని ఆదేశించింది. టీటీడీ బోర్డు సభ్యునిగా ఉన్న తనకు తిరుమల వెళ్లేందుకు కూడా అనుమతించాలని సండ్ర ఏసీబీ కోర్టును కోరారు. దీనిపై సోమవారం కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని కోర్టు ఆదేశించింది. పుష్కరాలకు వెళ్ళేందుకు తమకు అభ్యంతరం లేదని ఏసీబీ అధికారులు తెలపడంతో సండ్రకు కోర్టు అనుమతి దొరకడం ఈజీ అయ్యింది.
First Published:  23 July 2015 1:07 PM GMT
Next Story