Telugu Global
Others

పుష్కర ఉద్యోగులకు 27, 28 సెలవులు: కేసీఆర్‌

తెలంగాణలోని గోదావరి పుష్కరాల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఈ నెల 27, 28 తేదీలను సెలవుగా ప్రకటించారు. వీరంతా ఎంతో అంకిత భావంతో బాధ్యతలను నిర్వర్తించారని, అలసిపోయిన ఉద్యోగులు సేద తీరాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న మొట్టమొదటి గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఏలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు జరగకుండా పని చేసిన ఉద్యోగులందరికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

తెలంగాణలోని గోదావరి పుష్కరాల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఈ నెల 27, 28 తేదీలను సెలవుగా ప్రకటించారు. వీరంతా ఎంతో అంకిత భావంతో బాధ్యతలను నిర్వర్తించారని, అలసిపోయిన ఉద్యోగులు సేద తీరాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న మొట్టమొదటి గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఏలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు జరగకుండా పని చేసిన ఉద్యోగులందరికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.
First Published:  23 July 2015 1:15 PM GMT
Next Story