Telugu Global
CRIME

విందుకని పిలిచి... గ్యాంగ్ రేప్

తమ ఇంట్లో విందు ఉంది రమ్మని పిలిచి ఓ మహిళా ఉద్యోగినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు మృగాళ్ళు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో జరిగింది. ఆ ఉద్యోగినికి సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి తమ ఇంట్లో విందు ఉందని ఆహ్వానించాడు. దీనిని నమ్మిన ఆ మహిళా ఉద్యోగి అతని ఇంటికి వచ్చింది. ఓ పథకం ప్రకారం పిలిచాడని తెలియని ఆమె ఇంట్లో కూర్చుని ఉండగా విందు చాయలు కనిపించక పోయేసరికి అతన్ని ప్రశ్నించింది. ఇంతలో […]

విందుకని పిలిచి... గ్యాంగ్ రేప్
X

తమ ఇంట్లో విందు ఉంది రమ్మని పిలిచి ఓ మహిళా ఉద్యోగినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు మృగాళ్ళు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో జరిగింది. ఆ ఉద్యోగినికి సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి తమ ఇంట్లో విందు ఉందని ఆహ్వానించాడు. దీనిని నమ్మిన ఆ మహిళా ఉద్యోగి అతని ఇంటికి వచ్చింది. ఓ పథకం ప్రకారం పిలిచాడని తెలియని ఆమె ఇంట్లో కూర్చుని ఉండగా విందు చాయలు కనిపించక పోయేసరికి అతన్ని ప్రశ్నించింది. ఇంతలో అక్కడికి చేరుకున్న ఆ వ్యక్తి స్నేహితులు మాటలు చెబుతూ నమ్మించే యత్నం చేసి ఆపై అందరూ కలిసి ఆమెపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె తనపై జరిగిన దారుణాన్ని పోలీసులకు తెలపడంతో రంగలోకి దిగిన వారు సాముహిక అత్యాచారానికి పాల్పడిన వారిలో ఇరువురిని అరెస్టు చేయగా మరోకరు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈమె ఉద్యొగిని కాదని, బీటెక్‌ విద్యార్థిని అని, గ్యాంగ్‌ రేప్‌ చేసింది కూడా ఆమె స్నేహితులని అక్కడున్న వారు చెబుతున్నారు. సంఘటన జరిగి 15 రోజులైనప్పటికీ బాధిత విద్యార్థిని ఎవరికీ చెప్పకుండా చివరికి తెగించి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయట పడినట్టు తెలుస్తోంది. అయితే జరిగిన ఘాతుకాన్ని చెబితే చంపేస్తామని సదరు విద్యార్థులు బెదిరించడమే ఇప్పటివరకు ఆమె చెప్పకపోవడానికి కారణమంటున్నారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేసింది కూడా విద్యార్థులనేనని వారంటున్నారు.

First Published:  22 July 2015 7:20 PM GMT
Next Story