రేపు అనంతపురంలో పర్యటించనున్న రాహుల్
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ శుక్రవారం అనంతపురంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంలో ఆయన పది కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి రాహుల్ పాదయాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాహుల్ శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఉదయం 7.15 నిమిషాలకు కోడికొండ చెక్ పోస్టుకు చేరుకుంటారు. 9 గంటలకు ఓబుళ దేవర చెరువు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. గ్రామంలోని […]
BY sarvi22 July 2015 1:08 PM GMT
sarvi Updated On: 23 July 2015 2:36 AM GMT
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ శుక్రవారం అనంతపురంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంలో ఆయన పది కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి రాహుల్ పాదయాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాహుల్ శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఉదయం 7.15 నిమిషాలకు కోడికొండ చెక్ పోస్టుకు చేరుకుంటారు. 9 గంటలకు ఓబుళ దేవర చెరువు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. గ్రామంలోని జీవనజ్యోతి పాఠశాల విద్యార్థులు, చేనేత కార్మికులతో మాట్లాడతారు. తర్వాత మామిళ్లపల్లికుంటలోని రైతు హరినాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. డబులవారిపల్లిలో మహిళా సంఘాలు, ఉపాథి కూలీలతో సమావేశమైన అనంతరం కొండకమర్ల, తర్వాత పుట్టపర్తి చేరుకుంటారు. పుట్టపర్తిలో ఆయన సత్యసాయిబాబా సమాధిని దర్శిస్తారు.
Next Story