బాలికపై గ్యాంగ్రేప్ కేసులో ఎస్పీ నేత పుత్రరత్నం!
కఠినమైన చట్టాలు ఎన్ని చేసినా ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలు అంతమొందడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఒక టీనేజ్ బాలికను ఎస్పీ నేత కుమారుడు అతడి మిత్రులు కలిసి గ్యాంగ్రేప్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బడౌన్కు చెందిన సమాజ్వాద్ పార్టీ నేత కుమారుడు టెక్చంద్పాల్, అతడి స్నేహితులు నరేంద్ర, సురేంద్రలు కలిసి ఈనెల 18వ తేదీన పధ్నాలుగేళ్ల బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం జరిపారు. బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో […]
BY sarvi21 July 2015 1:18 PM GMT
sarvi Updated On: 22 July 2015 4:03 AM GMT
కఠినమైన చట్టాలు ఎన్ని చేసినా ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలు అంతమొందడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఒక టీనేజ్ బాలికను ఎస్పీ నేత కుమారుడు అతడి మిత్రులు కలిసి గ్యాంగ్రేప్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బడౌన్కు చెందిన సమాజ్వాద్ పార్టీ నేత కుమారుడు టెక్చంద్పాల్, అతడి స్నేహితులు నరేంద్ర, సురేంద్రలు కలిసి ఈనెల 18వ తేదీన పధ్నాలుగేళ్ల బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం జరిపారు. బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకరైన సురేంద్రను అరెస్ట్ చేశామని, మిగిలిన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారని జిల్లా ఎస్పీ అనిల్కుమార్ యాదవ్ తెలిపారు.
Next Story