Telugu Global
CRIME

బావమరిదిని చంపి.. సెప్టిక్ ట్యాంకులలో పూడ్చి!

తాగి గొడవ చేస్తున్నాడని బావమరిదిని హతమార్చి సెప్టిక్ ట్యాంకులో పూడ్చిపెట్టిన ఘటన ఏడాదిన్నర తరువాత వెలుగులోకి వచ్చింది. బేగంబ‌జార్ ఫీల్‌ఖానాకు చెందిన మ‌హేశ్ కుమార్ వ్యాస్ (40) తాగుడుకు బానిస‌య్యాడు. తాగుడు మానేయాల‌న్న‌ కుటుంబ‌స‌భ్యుల‌తో గొడ‌వ‌పెట్టుకున్న మ‌హేశ్ గ‌తేడాది ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. గండిపేట్ ప్రాంతంలో దేవాల‌యంలో పూజారిగా ప‌నిచేస్తున్న త‌న బావ ప‌వ‌న్‌కుమార్ జోషి (41) వ‌ద్ద కు వెళ్లి ఆశ్ర‌యం పొందాడు. అక్క‌డా తీరు మార్చుకోని మ‌హేశ్ తాగొచ్చి బావ‌తో గొడ‌వ‌ప‌డేవాడు. ఇది భ‌రించ‌లేని […]

తాగి గొడవ చేస్తున్నాడని బావమరిదిని హతమార్చి సెప్టిక్ ట్యాంకులో పూడ్చిపెట్టిన ఘటన ఏడాదిన్నర తరువాత వెలుగులోకి వచ్చింది. బేగంబ‌జార్ ఫీల్‌ఖానాకు చెందిన మ‌హేశ్ కుమార్ వ్యాస్ (40) తాగుడుకు బానిస‌య్యాడు. తాగుడు మానేయాల‌న్న‌ కుటుంబ‌స‌భ్యుల‌తో గొడ‌వ‌పెట్టుకున్న మ‌హేశ్ గ‌తేడాది ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. గండిపేట్ ప్రాంతంలో దేవాల‌యంలో పూజారిగా ప‌నిచేస్తున్న త‌న బావ ప‌వ‌న్‌కుమార్ జోషి (41) వ‌ద్ద కు వెళ్లి ఆశ్ర‌యం పొందాడు. అక్క‌డా తీరు మార్చుకోని మ‌హేశ్ తాగొచ్చి బావ‌తో గొడ‌వ‌ప‌డేవాడు. ఇది భ‌రించ‌లేని ప‌వ‌న్ బావ‌మ‌రిది మ‌హేశ్‌ను సుత్తితో త‌ల‌పై బాది హ‌తమార్చాడు. అనంత‌రం మృత‌దేహాన్ని స‌మీపంలోని సెప్టిక్ ట్యాంకులో ప‌డేశాడు. ఈ విష‌యాన్ని త‌న మిత్రులలైన హ‌రీశ్, జైశంక‌ర్‌ల‌కు విష‌యం చెప్పాడు. వారు వ‌చ్చి సెప్టిక్‌ట్యాంకులో మ‌ట్టి నింపి పైనుంచి కాంక్రీటుతో వేశారు. మ‌హేశ్‌ క‌నిపించ‌క‌పోవ‌డంతో కంగారుప‌డిన ఆయ‌న త‌ల్లి నార్సింగి పోలీసుస్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు ప‌వ‌న్‌ను ప్ర‌శ్నించ‌గా హ‌త్య విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. సెప్టిక్ ట్యాంకులో నుంచి అస్తిపంజ‌రాన్ని వెలికి తీశారు. నిందితుల‌ను అరెస్టు చేశారు.
First Published:  15 July 2015 7:02 PM GMT
Next Story