రైల్లో కేజీ బంగారం పట్టివేత
లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన రమేష్ బాబు అనే వ్యక్తి సికింద్రాబాద్ రావడానికి విజయవాడలో లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. విజయవాడ స్టేషన్లో పోలీసుల కళ్లుగప్పి కిలో బంగారంతో రైలెక్కిన రమేష్ సికింద్రాబాద్లో పోలీసులను తప్పించుకోలేక పోయాడు. పోలీసులు రమేష్ బాబుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పందంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రయాణికులకు […]
BY Pragnadhar Reddy15 July 2015 1:04 PM GMT
Pragnadhar Reddy Updated On: 15 July 2015 8:50 PM GMT
లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన రమేష్ బాబు అనే వ్యక్తి సికింద్రాబాద్ రావడానికి విజయవాడలో లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. విజయవాడ స్టేషన్లో పోలీసుల కళ్లుగప్పి కిలో బంగారంతో రైలెక్కిన రమేష్ సికింద్రాబాద్లో పోలీసులను తప్పించుకోలేక పోయాడు. పోలీసులు రమేష్ బాబుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పందంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రయాణికులకు సూచించారు.
Next Story