Telugu Global
Others

కేంద్రం వేధింపుల‌పై యాడ్ త‌యారు చేసిన ఆప్ ప్ర‌భుత్వం

కేంద్ర ప్ర‌భుత్వం  ఢిల్లీ ప్ర‌భుత్వాన్ని వేధిస్తున్నా ప్ర‌జాసేవ‌లో వెనుకంజ వేయ‌డం లేదంటూ  ఆప్ ప్ర‌భుత్వం ఒక టీవీ యాడ్‌ను విడుద‌ల చేసింది. ఆప్ ప్ర‌భుత్వం త‌న బ‌డ్జెట్‌లో ప్రచారం కోసం రూ. 520 కోట్ల‌ను కేటాయించ‌డంపై ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాల నుంచి ప‌లు విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నా వెరవ‌ని సీఎం కేజ్రీవాల్ కేంద్ర‌ ప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా పెట్టుకొని  టీవీ ప్ర‌చారం కోసం భారీగా ఖ‌ర్చు చేస్తున్నారు. 1.27 సెకండ్ల నిడివి గ‌ల ఈ టీవీ అడ్వ‌ర్ట‌యిజ్‌మెంట్‌లో ఆప్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన […]

కేంద్ర ప్ర‌భుత్వం ఢిల్లీ ప్ర‌భుత్వాన్ని వేధిస్తున్నా ప్ర‌జాసేవ‌లో వెనుకంజ వేయ‌డం లేదంటూ ఆప్ ప్ర‌భుత్వం ఒక టీవీ యాడ్‌ను విడుద‌ల చేసింది. ఆప్ ప్ర‌భుత్వం త‌న బ‌డ్జెట్‌లో ప్రచారం కోసం రూ. 520 కోట్ల‌ను కేటాయించ‌డంపై ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాల నుంచి ప‌లు విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నా వెరవ‌ని సీఎం కేజ్రీవాల్ కేంద్ర‌ ప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా పెట్టుకొని టీవీ ప్ర‌చారం కోసం భారీగా ఖ‌ర్చు చేస్తున్నారు. 1.27 సెకండ్ల నిడివి గ‌ల ఈ టీవీ అడ్వ‌ర్ట‌యిజ్‌మెంట్‌లో ఆప్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత చేసిన అభివృద్ధి, త‌మ‌ను ల‌క్ష్యంగా చేసుకొని కేంద్ర ప్ర‌భుత్వం వేధిస్తున్న అంశాల‌ను ప్ర‌స్తావించారు. ప్ర‌భుత్వ విడుద‌ల చేసిన ఈ ప్ర‌క‌ట‌న అన్ని టీవీ చానెల్స్‌లోనూ ప్రతిరోజూ అనేకసార్లు ప్రసారమ‌య్యే ఏర్పాట్లు చేశారు.
First Published:  9 July 2015 1:13 PM GMT
Next Story