Telugu Global
Others

లారీ ప్ర‌మాదంలో రూ. 50 ల‌క్ష‌ల టైర్లు ద‌గ్ధం

ఎంఆర్ఎఫ్ టైర్ల లోడుతో వెళుతున్న లారీ డివైడ‌ర్‌ను ఢీ కొట్ట‌డంతో లారీతో సహా అందులోని రూ. 50 ల‌క్ష‌ల విలువ చేసే టైర్లు కూడా కాలి బూడిదై పోయాయి. ఈ ప్ర‌మాదం 65వ నెంబ‌రు జాతీయ ర‌హ‌దారి పైన‌ న‌ల్ల‌గొండ జిల్లా కేతేప‌ల్లి మండ‌లం స‌మీపంలో జ‌రిగింది. హైద‌రాబాద్ నుంచి 300 ఎంఆర్ఎఫ్ టైర్ల‌ లోడుతో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వెళుతున్న లారీ ఉప్ప‌ల ప‌హాడ్ బ‌స్టాండ్ వ‌ద్ద ముందు వెళ్లున్న వాహ‌నాన్ని ఓవ‌ర్ టేక్ చేసేందుకు […]

ఎంఆర్ఎఫ్ టైర్ల లోడుతో వెళుతున్న లారీ డివైడ‌ర్‌ను ఢీ కొట్ట‌డంతో లారీతో సహా అందులోని రూ. 50 ల‌క్ష‌ల విలువ చేసే టైర్లు కూడా కాలి బూడిదై పోయాయి. ఈ ప్ర‌మాదం 65వ నెంబ‌రు జాతీయ ర‌హ‌దారి పైన‌ న‌ల్ల‌గొండ జిల్లా కేతేప‌ల్లి మండ‌లం స‌మీపంలో జ‌రిగింది. హైద‌రాబాద్ నుంచి 300 ఎంఆర్ఎఫ్ టైర్ల‌ లోడుతో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వెళుతున్న లారీ ఉప్ప‌ల ప‌హాడ్ బ‌స్టాండ్ వ‌ద్ద ముందు వెళ్లున్న వాహ‌నాన్ని ఓవ‌ర్ టేక్ చేసేందుకు ప్ర‌య‌త్నించి ప్ర‌మాదానికి గురైంది. డీజిల్ ట్యాంకు ప‌గిలి మంట‌లు వ్యాపించడంతో లారీలోని స‌రుకు మొత్తం కాలిపోయింది. న‌కిరేక‌ల్‌, సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ నుంచి వచ్చిన ఫైర్ ఇంజిన్లు మంట‌లను ఆర్పి వేసాయి. ద‌ట్ట‌మైన పొగ‌లు, మంట‌లు వ్యాపించ‌డంతో పోలీసులు ఆ మార్గంలో ప్ర‌యాణిస్తున్న వాహ‌నాల‌ను దారి మ‌ళ్ళించి మూసీ పాత బ్రిడ్జి మీద‌గా మ‌ళ్లించారు.

First Published:  6 July 2015 1:14 PM GMT
Next Story