నీళ్లు దొరకని చోట కూడా మద్యం
ఆదాయం కోసం ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం…మద్య నియంత్రణ ఉద్యమ సదస్సు ఆగ్రహం…! ఆంధ్రప్రదేశ్లో మద్యం నియంత్రిస్తే పరిపాలన కొనసాగించలేరా..? ఆదాయాన్ని సమకూర్చు కోవడానికే ఎన్నో మార్గాలుండగా.. మద్యం ఒక్కటే మార్గమని ఎంచుకోవడం ఏమిటి? ఆదాయం కోసం ప్రజల ప్రాణాలే ఫణంగా పెడతారా..? అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మద్య నియంత్రణ సదస్సు నిలదీసింది. రాష్ట్రంలో మంచినీళ్లు కంటే మద్యమే ఎక్కువగా లభిస్తోందని. మద్యం వల్ల కుటుంబాలు విచ్చిన్నమవుతు న్నాయని సదస్సు ఆవేదన వ్యక్తం చేసింది. […]
ఆంధ్రప్రదేశ్లో మద్యం నియంత్రిస్తే పరిపాలన కొనసాగించలేరా..? ఆదాయాన్ని సమకూర్చు కోవడానికే ఎన్నో మార్గాలుండగా.. మద్యం ఒక్కటే మార్గమని ఎంచుకోవడం ఏమిటి? ఆదాయం కోసం ప్రజల ప్రాణాలే ఫణంగా పెడతారా..? అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మద్య నియంత్రణ సదస్సు నిలదీసింది. రాష్ట్రంలో మంచినీళ్లు కంటే మద్యమే ఎక్కువగా లభిస్తోందని. మద్యం వల్ల కుటుంబాలు విచ్చిన్నమవుతు న్నాయని సదస్సు ఆవేదన వ్యక్తం చేసింది. అప్సా, మద్య నియంత్రణ కమిటీ హైదరాబాద్లో సంయుక్తంగా నిర్వహించిన మద్య నియంత్రణ ఉద్యమ సదస్సులో వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మాట్లాడారు.