సెక్షన్-8పై చంద్రబాబు ద్వంద్వ వైఖరి: బొత్స
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ వీడియో, చంద్రబాబు ఆడియో బయట పడిన దగ్గర నుంచి చంద్రబాబు అండ్ కో అదే పనిగా వల్లె వేస్తున్న సెక్షన్ 8పై రాష్ట్రపతితో ఎందుకు మాట్లాడటం లేదని బొత్స ప్రశ్నించారు. హైదరాబాద్లో విడిది చేసిన రాష్ట్రపతితో ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు విషయంపై చంద్రబాబు మాట్లాడవచ్చని, అదీ లేదంటే తిరుమల పర్యటనలో గంట సేపు రాష్ట్రపతితో గడిపిన సమయంలో […]
BY sarvi1 July 2015 1:20 PM GMT
sarvi Updated On: 2 July 2015 4:31 AM GMT
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ వీడియో, చంద్రబాబు ఆడియో బయట పడిన దగ్గర నుంచి చంద్రబాబు అండ్ కో అదే పనిగా వల్లె వేస్తున్న సెక్షన్ 8పై రాష్ట్రపతితో ఎందుకు మాట్లాడటం లేదని బొత్స ప్రశ్నించారు. హైదరాబాద్లో విడిది చేసిన రాష్ట్రపతితో ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు విషయంపై చంద్రబాబు మాట్లాడవచ్చని, అదీ లేదంటే తిరుమల పర్యటనలో గంట సేపు రాష్ట్రపతితో గడిపిన సమయంలో మాట్లాడి ఉండొచ్చని బొత్స అన్నారు. అవేమీ చేయకుండా కేవలం మీడియా ముందు మాత్రమే చంద్రబాబు సెక్షన్ 8 అమలుపై మాట్లాడటం ఆయన ద్వంద్వ నీతికి అద్దం పడుతోందని బొత్స విమర్శించారు.
Next Story