Telugu Global
Others

పార్టీ మారే ఆలోచన ఉంటే మీకే చెబుతా: బొబ్బిలి ఎమ్మెల్యే

విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజయవర్గం ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు మంగళవారం మధ్యాహ్నం వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. స‌మావేశం త‌ర్వాత బ‌య‌టికి వచ్చిన ఆయన విలేకరుల‌తో మాట్లాడుతూ జగన్‌ను తాను మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. పార్టీ మారే అభిప్రాయం ఉంటే మీడియాకే ముందు చెబుతాన‌ని అన్నారు. బొత్సతో విభేదాలపై ఓ విలేకరి ప్రశ్నించగా ఆ విషయంపై ఇప్పుడు స్పందించనని చెప్పారు. వైసీపీకి నష్టం కలిగించే చర్యలకు తాను పాల్పడనని తెలిపారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజయవర్గం ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు మంగళవారం మధ్యాహ్నం వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. స‌మావేశం త‌ర్వాత బ‌య‌టికి వచ్చిన ఆయన విలేకరుల‌తో మాట్లాడుతూ జగన్‌ను తాను మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. పార్టీ మారే అభిప్రాయం ఉంటే మీడియాకే ముందు చెబుతాన‌ని అన్నారు. బొత్సతో విభేదాలపై ఓ విలేకరి ప్రశ్నించగా ఆ విషయంపై ఇప్పుడు స్పందించనని చెప్పారు. వైసీపీకి నష్టం కలిగించే చర్యలకు తాను పాల్పడనని తెలిపారు.
First Published:  29 Jun 2015 1:12 PM GMT
Next Story