Telugu Global
Others

ఆ అమ్మాయిని ప్రియుడికే ఇచ్చి చేశారు!

గుంటూరు జిల్లా వేమూరు మండ‌లం రావికంపాడు పంట‌పొలాల్లో శ‌నివారం వేకువ‌జామున అత్యాచారానికి గురైన యువ‌తికి పెద్ద‌లు ప్రియుడితోనే వివాహం జ‌రిపించారు. పోలీసుల‌మ‌ని చెప్పిన న‌లుగురు దుండగులు ఈ జంట‌ను బెదిరించి స‌ద‌రుయువ‌తిపై సామూహిక అత్యాచారం జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఘ‌ట‌న గురించి తెలుసుకున్న యువ‌తి బంధువులు ఉయ‌దం రూర‌ల్ పోలీస్ స్టేష‌న్‌కు చేరుకున్నారు. ప్రేమికుడు రాజేశ్ వ్య‌వ‌సాయ కూలీ కాగా, యువ‌తికి త‌ల్లిదండ్రులు లేరు. అమ్మాయికి అన్యాయం జ‌ర‌గ‌కుండా రాజేశ్‌కే ఇచ్చి పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించారు. దీంతో […]

గుంటూరు జిల్లా వేమూరు మండ‌లం రావికంపాడు పంట‌పొలాల్లో శ‌నివారం వేకువ‌జామున అత్యాచారానికి గురైన యువ‌తికి పెద్ద‌లు ప్రియుడితోనే వివాహం జ‌రిపించారు. పోలీసుల‌మ‌ని చెప్పిన న‌లుగురు దుండగులు ఈ జంట‌ను బెదిరించి స‌ద‌రుయువ‌తిపై సామూహిక అత్యాచారం జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఘ‌ట‌న గురించి తెలుసుకున్న యువ‌తి బంధువులు ఉయ‌దం రూర‌ల్ పోలీస్ స్టేష‌న్‌కు చేరుకున్నారు. ప్రేమికుడు రాజేశ్ వ్య‌వ‌సాయ కూలీ కాగా, యువ‌తికి త‌ల్లిదండ్రులు లేరు. అమ్మాయికి అన్యాయం జ‌ర‌గ‌కుండా రాజేశ్‌కే ఇచ్చి పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించారు. దీంతో కొల్లూరులో పెద్ద‌చర్చిలో వీరి వివాహం జ‌రిగింది. అత్యాచారానికి పాల్ప‌డ్డ న‌లుగురిలో రాతంశెట్టి సుధాక‌ర్ (39), అడుసుమిల్లి వెంక‌టేశ్వ‌ర‌రావు (26)ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. ప‌రారీలో ఉన్న ఇద్ద‌రి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
First Published:  28 Jun 2015 1:08 PM GMT
Next Story