ఎర్రబెల్లి ఇంటి ఎదుట ఎమ్మార్పీఎస్ చావుడప్పు
ఓటుకు నోటు కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును సమర్థిస్తున్న పాలకుర్తి (వరంగల్) ఎమ్మెల్యే ఎర్రబెల్లి ఇంటి ఎదుట ఎమ్మార్పీఎస్ నిరసన తెలిపింది. హన్మకొండలోని రాంనగర్లోని ఆయన ఇంటి ఎదుట ‘చావుడప్పు’ పేరిట భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణను అన్ని విధాలా దెబ్బతీయాలని చూస్తోన్న చంద్రబాబుకు మద్దతుగా నిలవడంపై మండిపడ్డారు. వెంటనే తెలంగాణ టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ప్రజలంతా సఖ్యతతోనే ఉన్నారన్నారు. సెక్షన్-8 పేరిట ఇరుప్రాంతాల మధ్య […]
BY Pragnadhar Reddy27 Jun 2015 11:53 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 27 Jun 2015 11:53 PM GMT
ఓటుకు నోటు కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును సమర్థిస్తున్న పాలకుర్తి (వరంగల్) ఎమ్మెల్యే ఎర్రబెల్లి ఇంటి ఎదుట ఎమ్మార్పీఎస్ నిరసన తెలిపింది. హన్మకొండలోని రాంనగర్లోని ఆయన ఇంటి ఎదుట ‘చావుడప్పు’ పేరిట భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణను అన్ని విధాలా దెబ్బతీయాలని చూస్తోన్న చంద్రబాబుకు మద్దతుగా నిలవడంపై మండిపడ్డారు. వెంటనే తెలంగాణ టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ప్రజలంతా సఖ్యతతోనే ఉన్నారన్నారు. సెక్షన్-8 పేరిట ఇరుప్రాంతాల మధ్య విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు పార్టీని వీడి రావాలని డిమాండ్ చేశారు.
Next Story