Telugu Global
Others

బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ క‌న్స‌ల్ట‌న్సీ సంస్థ‌

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో మరో సాఫ్ట్‌వేర్‌ సంస్థ బోర్డు తిప్పేసింది. మల్టీ నేషనల్‌ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఏఎంసీ స్క్వేర్‌ సాఫ్ట్‌వేర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఘరానా మోసానికి పాల్పడింది. దాదాపు 140 మంది నిరుద్యోగుల నుంచి రూ.40 వేల చొప్పున దాదాపు 50 ల‌క్ష‌ల‌కు పైగా వసూలు చేసి కంపెనీ యాజమాన్యం పరారైంది. తాము మోస పోయినట్లు గుర్తించిన బాధితులు ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో మరో సాఫ్ట్‌వేర్‌ సంస్థ బోర్డు తిప్పేసింది. మల్టీ నేషనల్‌ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఏఎంసీ స్క్వేర్‌ సాఫ్ట్‌వేర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఘరానా మోసానికి పాల్పడింది. దాదాపు 140 మంది నిరుద్యోగుల నుంచి రూ.40 వేల చొప్పున దాదాపు 50 ల‌క్ష‌ల‌కు పైగా వసూలు చేసి కంపెనీ యాజమాన్యం పరారైంది. తాము మోస పోయినట్లు గుర్తించిన బాధితులు ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
First Published:  26 Jun 2015 1:19 PM GMT
Next Story