Telugu Global
Others

జులై 2నుంచి ఇంజినీరింగ్ త‌ర‌గ‌తులు: గంటా

ఏపీలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ పూర్తయిందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. జులై 2 నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. గతంలో సెప్టెంబర్, అక్టోబర్‌లో క్లాసులు మొదలయ్యేవని, ఈసారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లనే జులైలోనే ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయని మంత్రి పేర్కొన్నారు. గ‌తంలో జులై వ‌చ్చేస‌రికి ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ అస‌లు ప్రారంభ‌మ‌య్యేదే కాద‌ని గంటా అన్నారు. త‌మ ప్ర‌భుత్వం విద్యా సంవ‌త్స‌రాన్ని ఓ పద్ధ‌తి ప్ర‌కారం నిర్వ‌హించాల‌ని భావిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

ఏపీలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ పూర్తయిందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. జులై 2 నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. గతంలో సెప్టెంబర్, అక్టోబర్‌లో క్లాసులు మొదలయ్యేవని, ఈసారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లనే జులైలోనే ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయని మంత్రి పేర్కొన్నారు. గ‌తంలో జులై వ‌చ్చేస‌రికి ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ అస‌లు ప్రారంభ‌మ‌య్యేదే కాద‌ని గంటా అన్నారు. త‌మ ప్ర‌భుత్వం విద్యా సంవ‌త్స‌రాన్ని ఓ పద్ధ‌తి ప్ర‌కారం నిర్వ‌హించాల‌ని భావిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

First Published:  25 Jun 2015 1:40 PM GMT
Next Story