Telugu Global
Others

హిందూపురంలో బాల‌య్య ‘ప్రజాదర్బార్‌’

మొన్నామ‌ధ్య త‌మ‌కు ఎమ్మెల్యే బాల‌కృష్ణ అందుబాటులో ఉండ‌డం లేదంటూ హిందూపురం వాసులు హైద‌రాబాద్ వ‌చ్చి నిర‌స‌న తెలిపారు. దీంతో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. ప్రజలకు చేరువయ్యేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చేందుకు దృష్టి సారించారు. ఇందులోభాగంగా బుధవారం హిందూపురంలో ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలు తక్షణమే పరిష్కారమయ్యేలా […]

మొన్నామ‌ధ్య త‌మ‌కు ఎమ్మెల్యే బాల‌కృష్ణ అందుబాటులో ఉండ‌డం లేదంటూ హిందూపురం వాసులు హైద‌రాబాద్ వ‌చ్చి నిర‌స‌న తెలిపారు. దీంతో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. ప్రజలకు చేరువయ్యేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చేందుకు దృష్టి సారించారు. ఇందులోభాగంగా బుధవారం హిందూపురంలో ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలు తక్షణమే పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని బాలయ్య హామీ ఇచ్చారు. ప్రజాదర్బార్ ఇంతటితో ఆగదని ఆయన స్పష్టంచేశారు. ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళలు, వృద్ధులు తమ సమస్యల చెప్పుకునేందుకు క్యూ కట్టారు. అందరి సమస్యలను బాలయ్య సావధానంగా విన్నారు.
First Published:  24 Jun 2015 1:07 PM GMT
Next Story