Telugu Global
Others

జ‌య‌ల‌లిత‌కు పాక్ మీడియా ప్ర‌శంస‌లు

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌కు పాకిస్థాన్ మీడియా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించింది. స‌మ్మా అనే ఓ పాకిస్థాన్ టీవీ ఛాన‌ల్ త‌మిళ‌నాడులో జ‌య‌ల‌లిత ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాన్ని త‌మ దేశంలో కూడా అమ‌లు చేయాల‌ని ఆ టీవీ ఛాన‌ల్ అభిల‌షించింది. రంజాన్ మాసం సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల‌కు పైగా ఉన్న మ‌సీదుల‌కు 4,500 ట‌న్నుల బియ్యం ఉచితంగా ఇవ్వ‌డం ఈ ప‌థ‌కం ఉద్దేశ్యం. మ‌సీదుల వ‌ద్ద ఉన్న పేద ముస్లింల‌కు గంజి పంపిణీ చేయ‌డానికి […]

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌కు పాకిస్థాన్ మీడియా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించింది. స‌మ్మా అనే ఓ పాకిస్థాన్ టీవీ ఛాన‌ల్ త‌మిళ‌నాడులో జ‌య‌ల‌లిత ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాన్ని త‌మ దేశంలో కూడా అమ‌లు చేయాల‌ని ఆ టీవీ ఛాన‌ల్ అభిల‌షించింది. రంజాన్ మాసం సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల‌కు పైగా ఉన్న మ‌సీదుల‌కు 4,500 ట‌న్నుల బియ్యం ఉచితంగా ఇవ్వ‌డం ఈ ప‌థ‌కం ఉద్దేశ్యం. మ‌సీదుల వ‌ద్ద ఉన్న పేద ముస్లింల‌కు గంజి పంపిణీ చేయ‌డానికి ఈ బియ్యాన్ని ఉప‌యోగించ‌నున్నారు. కాగా తమ అధినేత్రి జ‌య‌ల‌లిత తీసుకున్న ఈ నిర్ణయాన్ని ‘సమ్మా’ ఎంతో ప్రశంసించిదని త‌మిళ ప్ర‌భుత్వ‌ అధికార పత్రిక ‘డాక్టర్ నమదు ఎంజీఆర్’లో అన్నాడీఎంకే పార్టీ తెలిపింది. విజయ సూచిక చూపిస్తున్న జయలలిత ఫోటో, పార్టీ రెండాకుల గుర్తును స‌మ్మా టీవీ ప్రసారం చేసిందని వెల్లడించింది.
First Published:  18 Jun 2015 1:08 PM GMT
Next Story