Telugu Global
Others

కేసీఆర్‌కు తొత్తులా ఏసీబీ: ఎర్రబెల్లి

రేవంత్‌రెడ్డి కేసులో ఏసీబీ దర్యాప్తు సరిగా లేదని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించాలన్నారు. సీఎం కేసీఆర్‌కు ఏసీబీ తొత్తులా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. సండ్ర, వేం నరేందర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. నోటీసులివ్వ‌కుండా నోటీసులు ఇచ్చిన‌ట్టు చెబుతూ కేసీఆర్ ప్ర‌భుత్వం మైండ్‌గేమ్ ఆడుతోంద‌ని విమ‌ర్శించారు. ఇరు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకోలేని గవర్నర్‌ తప్పుకోవాలని ఎర్రబెల్లి డిమాండ్‌ చేశారు.

రేవంత్‌రెడ్డి కేసులో ఏసీబీ దర్యాప్తు సరిగా లేదని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించాలన్నారు. సీఎం కేసీఆర్‌కు ఏసీబీ తొత్తులా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. సండ్ర, వేం నరేందర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. నోటీసులివ్వ‌కుండా నోటీసులు ఇచ్చిన‌ట్టు చెబుతూ కేసీఆర్ ప్ర‌భుత్వం మైండ్‌గేమ్ ఆడుతోంద‌ని విమ‌ర్శించారు. ఇరు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకోలేని గవర్నర్‌ తప్పుకోవాలని ఎర్రబెల్లి డిమాండ్‌ చేశారు.
First Published:  16 Jun 2015 1:09 PM GMT
Next Story