Telugu Global
Others

ఇద్ద‌రి ప్రాణం తీసిన 'మ‌హాసంక‌ల్పం' బ‌స్సు!

మహాసంకల్పం సభకు వెళుతున్న బస్సు సోమవారం రెండు నిండుప్రాణాల్ని బలి తీసుకుంది. బాధితుల బంధువుల కథనం మేరకు… కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం పల్లెపాలెంకు చెందిన అనిరాజు వీరాంజనేయులు(29), వెంకటనారాయణపురానికి చెందిన తమ్ముడు ఏడుకొండలు (29) స్నేహితులు. వీరు బైక్‌పై విజయవాడ వెళ్లి తిరిగివస్తున్నారు. అదే సమయంలో మచిలీపట్నం నుంచి టీడీపీ కార్యకర్తలతో గుంటూరు జిల్లాలో జరుగుతున్న మహాసంకల్పం బహిరంగ సభకు వెళుతున్న బస్సు పమిడిముక్కల మండలం గోపువానిపాలెం వద్ద ఈ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో […]

మహాసంకల్పం సభకు వెళుతున్న బస్సు సోమవారం రెండు నిండుప్రాణాల్ని బలి తీసుకుంది. బాధితుల బంధువుల కథనం మేరకు… కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం పల్లెపాలెంకు చెందిన అనిరాజు వీరాంజనేయులు(29), వెంకటనారాయణపురానికి చెందిన తమ్ముడు ఏడుకొండలు (29) స్నేహితులు. వీరు బైక్‌పై విజయవాడ వెళ్లి తిరిగివస్తున్నారు. అదే సమయంలో మచిలీపట్నం నుంచి టీడీపీ కార్యకర్తలతో గుంటూరు జిల్లాలో జరుగుతున్న మహాసంకల్పం బహిరంగ సభకు వెళుతున్న బస్సు పమిడిముక్కల మండలం గోపువానిపాలెం వద్ద ఈ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయపడిన వీరాంజనేయులు, ఏడుకొండలను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
First Published:  7 Jun 2015 1:44 PM GMT
Next Story