Telugu Global
Others

విమానం టాయిలెట్‌లో 4 కిలోల బంగారం

శనివారం తెల్లవారుజామున మస్కట్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వ‌చ్చిన ఎయిర్ ఇండియా విమానంలో టాయ్‌లెట్‌లో నాలుగు కేజీల బంగారం దొరికింది. మ‌స్క‌ట్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తనతో పాటు అక్రమంగా తీసుకొచ్చిన  ఈ నాలుగు కేజీల బంగారు బిస్కెట్లను దొరికి పోతాన‌నే భయంతో త‌న లగేజీ బ్యాగును విమానంలోని టాయిలెట్‌లో వదిలేసి వెళ్ళి ఉంటాడ‌ని భావిస్తున్నారు. టాయ్‌లెట్‌లో బంగారాన్ని గమనించిన ఎయిర్‌లైన్స్ సిబ్బంది కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం డీఆర్‌ఐ అధికారులు బంగారాన్ని స్వాధీనం […]

శనివారం తెల్లవారుజామున మస్కట్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వ‌చ్చిన ఎయిర్ ఇండియా విమానంలో టాయ్‌లెట్‌లో నాలుగు కేజీల బంగారం దొరికింది. మ‌స్క‌ట్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తనతో పాటు అక్రమంగా తీసుకొచ్చిన ఈ నాలుగు కేజీల బంగారు బిస్కెట్లను దొరికి పోతాన‌నే భయంతో త‌న లగేజీ బ్యాగును విమానంలోని టాయిలెట్‌లో వదిలేసి వెళ్ళి ఉంటాడ‌ని భావిస్తున్నారు. టాయ్‌లెట్‌లో బంగారాన్ని గమనించిన ఎయిర్‌లైన్స్ సిబ్బంది కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం డీఆర్‌ఐ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడి వివరాలు తెలుసుకునేందుకు అధికారులు విచారణ జరుపుతున్నారు
First Published:  30 May 2015 1:06 PM GMT
Next Story