Telugu Global
Others

ఢిల్లీలో చైనా స్మగ్లర్‌ను పట్టుకున్న ఏపీ పోలీసులు

చైనాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్‌ చైనీఫియాన్‌ను చిత్తూరు పోలీసులు శనివారంనాడు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ శివారుల్లో ఎర్రచందనం దుంగల విక్రయం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఏపీ స్పెషల్‌ టాస్క్‌ఫోర్సు పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎర్రచందనం దుంగలను కొనుగోలు చేయడానికి వచ్చిన చైనీఫియాన్‌ను ఢిల్లీలోని పహర్‌గంజ్‌ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి ఎర్రచందనంతో తయారు చేసిన బుద్ధుడి విగ్రహం సహా భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

చైనాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్‌ చైనీఫియాన్‌ను చిత్తూరు పోలీసులు శనివారంనాడు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ శివారుల్లో ఎర్రచందనం దుంగల విక్రయం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఏపీ స్పెషల్‌ టాస్క్‌ఫోర్సు పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎర్రచందనం దుంగలను కొనుగోలు చేయడానికి వచ్చిన చైనీఫియాన్‌ను ఢిల్లీలోని పహర్‌గంజ్‌ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి ఎర్రచందనంతో తయారు చేసిన బుద్ధుడి విగ్రహం సహా భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
First Published:  29 May 2015 1:27 PM GMT
Next Story