పోలీసుల అదుపులో రాందేవ్బాబా సోదరుడు
యోగా గురువు రాందేవ్ బాబా సోదరుడు రాంభరత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న హరిద్వార్లోని పతంజలి హెర్బల్ ఫుడ్ పార్క్ సిబ్బందికి, ట్రాన్స్ఫోర్టర్స్ మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పతంజలి ఉత్పత్తులను కొంతకాలం నుంచి తమ చేత పంపిణీ చేయించట్లేదంటూ ట్రాన్స్పోర్టర్లు ఫుడ్ పార్క్ సిబ్బందితో ఘర్షణకు దిగారు. దీనిపై ట్రాన్స్ఫోర్టర్స్ సిబ్బందితో రాంభరత్ మాట్లాడుతున్న సమయంలో మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఇరు వర్గాలు తుపాకులతో కాల్పులకు […]
BY Pragnadhar Reddy27 May 2015 1:39 PM GMT
Pragnadhar Reddy Updated On: 28 May 2015 12:36 PM GMT
యోగా గురువు రాందేవ్ బాబా సోదరుడు రాంభరత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న హరిద్వార్లోని పతంజలి హెర్బల్ ఫుడ్ పార్క్ సిబ్బందికి, ట్రాన్స్ఫోర్టర్స్ మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పతంజలి ఉత్పత్తులను కొంతకాలం నుంచి తమ చేత పంపిణీ చేయించట్లేదంటూ ట్రాన్స్పోర్టర్లు ఫుడ్ పార్క్ సిబ్బందితో ఘర్షణకు దిగారు. దీనిపై ట్రాన్స్ఫోర్టర్స్ సిబ్బందితో రాంభరత్ మాట్లాడుతున్న సమయంలో మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఇరు వర్గాలు తుపాకులతో కాల్పులకు పాల్పడటంతో ఒకరు మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రాంభరత్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
Next Story