Telugu Global
Others

చంద్రబాబు నాయకత్వంలో పోరాటానికి మేం రెడీ: రఘువీరా

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. అవసరమైతే చంద్రబాబు నాయకత్వంలో పోరాటానికీ తాము సిద్ధమేనని రఘువీరా తెలిపారు. రాష్ట్రాన్ని విభజించి ఏపీ అభివృద్ధికి అనేక ప్యాకేజీలు ఇచ్చామని, వాటిని అమలు చేయడంలో ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్తిబాబు ఆరోపించారు. ఎన్డీయే ప్ర‌భుత్వంతో అమ‌లు చేయించుకోవ‌ల‌సిన బాధ్య‌త తెలుగుదేశం ప్ర‌భుత్వంపై ఉంద‌ని, అది చంద్ర‌బాబుకు తెలిసి […]

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. అవసరమైతే చంద్రబాబు నాయకత్వంలో పోరాటానికీ తాము సిద్ధమేనని రఘువీరా తెలిపారు. రాష్ట్రాన్ని విభజించి ఏపీ అభివృద్ధికి అనేక ప్యాకేజీలు ఇచ్చామని, వాటిని అమలు చేయడంలో ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్తిబాబు ఆరోపించారు. ఎన్డీయే ప్ర‌భుత్వంతో అమ‌లు చేయించుకోవ‌ల‌సిన బాధ్య‌త తెలుగుదేశం ప్ర‌భుత్వంపై ఉంద‌ని, అది చంద్ర‌బాబుకు తెలిసి కూడా తెలియ‌న‌ట్టు న‌టిస్తున్నార‌ని బొత్స విమ‌ర్శించారు.

First Published:  24 May 2015 1:14 PM GMT
Next Story