Telugu Global
Others

మెక్సికోలో 42 మంది డ్ర‌గ్ మాఫీయా స‌భ్యులు హ‌తం

మెక్సికో ప‌శ్చిమ ప్రాంతంలోని మిచిగాన్ రాష్ట్రంలో మాద‌క ద్ర‌వ్యాల ముఠా, పోలీసుల‌కు మ‌ధ్య భారీ ఎత్తున కాల్పులు జ‌రిగాయి. సుదీర్ఘ స‌మ‌యం అంటే దాదాపు మూడు గంట‌ల‌పాటు జ‌రిగిన ఈ కాల్పుల్లో 42 మంది మాద‌క ద్ర‌వ్యాలు స‌ర‌ఫ‌రా చేసే ముఠా స‌భ్యులు చ‌నిపోయారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విష‌యాన్ని మిచిగాన్ రాష్ట్ర భ‌ద్ర‌తా ద‌ళ క‌మిష‌న‌ర్ మౌంట్ అలెజాండ్రో రుబిడో తెలిపారు. ఈ మాద‌క ద్ర‌వ్యాల ముఠాల‌కు ఆసియా, […]

మెక్సికో ప‌శ్చిమ ప్రాంతంలోని మిచిగాన్ రాష్ట్రంలో మాద‌క ద్ర‌వ్యాల ముఠా, పోలీసుల‌కు మ‌ధ్య భారీ ఎత్తున కాల్పులు జ‌రిగాయి. సుదీర్ఘ స‌మ‌యం అంటే దాదాపు మూడు గంట‌ల‌పాటు జ‌రిగిన ఈ కాల్పుల్లో 42 మంది మాద‌క ద్ర‌వ్యాలు స‌ర‌ఫ‌రా చేసే ముఠా స‌భ్యులు చ‌నిపోయారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విష‌యాన్ని మిచిగాన్ రాష్ట్ర భ‌ద్ర‌తా ద‌ళ క‌మిష‌న‌ర్ మౌంట్ అలెజాండ్రో రుబిడో తెలిపారు. ఈ మాద‌క ద్ర‌వ్యాల ముఠాల‌కు ఆసియా, అమెరికా దేశాల ముఠాల‌తో సంబంధాలున్నాయని ఆయ‌న చెప్పారు. ఆయా దేశాల‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేయ‌డం వీరి ప్ర‌ధాన వృత్తి అని తెలిపారు. గ‌తంలో కూడా అనేక‌సార్లు ఈ ముఠాలు పోలీసుల‌పై దాడులు జ‌రిపాయ‌ని, ఈసారి మాత్రం పెద్ద సంఖ్య‌లో కాల్పుల్లో పాల్గొన్నార‌ని రుబిడో చెప్పారు. పారిపోయిన స‌భ్యుల కోసం గాలిస్తున్నామ‌ని, మాద‌క ద్ర‌వ్యాల బెడ‌దను తొల‌గించ‌డ‌మే ల‌క్ష్యంగా త‌మ ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌ని ఆయ‌న తెలిపారు.

First Published:  22 May 2015 1:13 PM GMT
Next Story