Telugu Global
Cinema & Entertainment

గ్యాప్ లో మరో సినిమా పూర్తిచేస్తున్నాడు..

ఏ డైరక్టర్ అయినా సినిమా-సినిమాకి మధ్య ఓ గ్యాప్ తీసుకోవాలనుకుంటాడు. ఆ ఖాళీ సమయంలో మరో కొత్త కథ రాసుకుంటాడు. కుదిరితే ఇద్దరు ముగ్గురు హీరోలకు ఆ కథలు వినిపించే పనిలో ఉంటాడు. కానీ పూరి జగన్నాధ్ కు మాత్రం గ్యాప్ అవసరం లేదు. ఎందుకంటే.. ఆయన దగ్గర కథల లైబ్రరీ ఉంది. హీరోలు కూడా సిద్ధంగా ఉన్నారు. సెల్ఫ్ లోంచి ఓ కథ తీయడం.. 48 గంటల్లో స్క్రీన్ ప్లే పూర్తిచేయడం.. సెట్స్ పైకి వెళ్లడం.. […]

గ్యాప్ లో మరో సినిమా పూర్తిచేస్తున్నాడు..
X
ఏ డైరక్టర్ అయినా సినిమా-సినిమాకి మధ్య ఓ గ్యాప్ తీసుకోవాలనుకుంటాడు. ఆ ఖాళీ సమయంలో మరో కొత్త కథ రాసుకుంటాడు. కుదిరితే ఇద్దరు ముగ్గురు హీరోలకు ఆ కథలు వినిపించే పనిలో ఉంటాడు. కానీ పూరి జగన్నాధ్ కు మాత్రం గ్యాప్ అవసరం లేదు. ఎందుకంటే.. ఆయన దగ్గర కథల లైబ్రరీ ఉంది. హీరోలు కూడా సిద్ధంగా ఉన్నారు. సెల్ఫ్ లోంచి ఓ కథ తీయడం.. 48 గంటల్లో స్క్రీన్ ప్లే పూర్తిచేయడం.. సెట్స్ పైకి వెళ్లడం.. ఇదే పూరి స్టయిల్. ఇప్పుడీ సూపర్ ఫాస్ట్ డైరక్టర్, నితిన్ తో మరో మూవీకి సిద్ధమౌతున్నాడు.
ప్రస్తుతం చార్మితో జ్యోతిలక్ష్మి సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాధ్. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. రేపోమాపో విడుదలవుతుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి 150వ సినిమా ఆటోజానీని డైరక్ట్ చేస్తాడు పూరి. ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రారంభమౌతుంది. అంటే ఇంకో 3 నెలల గ్యాప్ ఉంది. ఈ 90రోజుల్లో నితిన్ తో ఓ మూవీ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేశాడు పూరి. ఇప్పటికే మా అమ్మ సీతామాలక్ష్మి అనే టైటిల్ ఫిక్స్ చేశాడు ఈ సినిమాకి. త్వరలోనే నితిన్-పూరి కలిసి సెట్స్ పైకి వెళ్తారు. హార్ట్ ఎటాక్ టీం యాజ్ ఇటీజ్ గా ఈ సినిమాకి పనిచేస్తుంది.
First Published:  22 May 2015 1:29 AM GMT
Next Story