అటవీ ఉద్యోగి హత్య... లారీ డ్రైవర్ పరార్!
తమను ఛేజ్ చేస్తూ వస్తున్న అటవీ సిబ్బంది అడ్డుతొలగించుకునే యత్నంలో ఓ ఉద్యోగిని లారీతో గుద్ది చంపేశారు దుండగులు. ఈ సంఘటన తిరుపతి దగ్గర రేణిగుంట చెక్పోస్టు సమీపంలో జరిగింది. మామూలుగా ఎప్పటిలాగే రేణిగుంట చెక్పోస్టు వద్ద అటవీశాఖ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇలా నిర్వహిస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన లారీని కూడా తనిఖీ చేయడానికి ప్రయత్నించి ఆపమని డ్రైవర్కు సంకేతాలిచ్చారు అటవీశాఖ సిబ్బంది. కాని డ్రైవర్ లారీని ఆపకుండా స్పీడ్గా పోనివ్వడంతో దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. […]
BY Pragnadhar Reddy18 May 2015 2:56 AM GMT
Pragnadhar Reddy Updated On: 18 May 2015 9:24 PM GMT
తమను ఛేజ్ చేస్తూ వస్తున్న అటవీ సిబ్బంది అడ్డుతొలగించుకునే యత్నంలో ఓ ఉద్యోగిని లారీతో గుద్ది చంపేశారు దుండగులు. ఈ సంఘటన తిరుపతి దగ్గర రేణిగుంట చెక్పోస్టు సమీపంలో జరిగింది. మామూలుగా ఎప్పటిలాగే రేణిగుంట చెక్పోస్టు వద్ద అటవీశాఖ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇలా నిర్వహిస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన లారీని కూడా తనిఖీ చేయడానికి ప్రయత్నించి ఆపమని డ్రైవర్కు సంకేతాలిచ్చారు అటవీశాఖ సిబ్బంది. కాని డ్రైవర్ లారీని ఆపకుండా స్పీడ్గా పోనివ్వడంతో దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. అయినా ఆపకపోవడంతో అటవీ సిబ్బంది దాన్ని ఛేజ్ చేసి ఆపాలనుకున్నారు. ఈ ప్రయత్నంలో లారీ డ్రైవర్ తానెక్కడ దొరికిపోతానో అనే భయంతో ఏకంగా మోటార్ సైకిల్పై ఛేజ్ చేస్తున్న అటవీ సిబ్బంది వాహనంపై నుంచే లారీని పోనిచ్చాడు. ఈ సంఘటనలో మోటారు సైకిల్ నడుపుతున్న ఉద్యోగి అక్కడిక్కడే మరణించాడు. లారీ డ్రైవర్ మాత్రం వాహనంతో పారిపోయాడు. బహుశా ఆ లారీలో ఎర్ర చందనం దుంగలు ఉండవచ్చని అటవీశాఖ సిబ్బంది అనుమానిస్తున్నారు. లారీ కోసం, డ్రైవర్ కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. ఇంత ధైర్యంగా లారీని తీసుకుపోవడం, వెంటాడుతున్న ఉద్యోగిని చంపడం వెనుక కొంతమంది పెద్దల హస్తం ఉండి ఉంటుందని భావిస్తున్నారు.
Next Story