ప్రజాదరణను ఓర్వలేకనే రాహుల్పై విమర్శలు : ఉత్తమ్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్రపై ఇతర పార్టీల నాయకులు చేస్తున్న విమర్శలు అర్థరహితమని ఆ పార్టీ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన రాహుల్పై ఇతర పార్టీల నేతలు చేస్తున్న విమర్శలను తప్పుపట్టారు. కాంగ్రెస్కు వస్తున్న ప్రజాదరణ చూసి టీఆర్ఎస్, బీజేపీ ఉలిక్కి పడుతున్నాయన్నారు. ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేసేందుకే రాహుల్ గాంధీ పాదయాత్ర చేపడుతున్నారని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ యాత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానికి […]
BY Pragnadhar Reddy12 May 2015 8:35 PM GMT
Pragnadhar Reddy Updated On: 13 May 2015 7:50 PM GMT
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్రపై ఇతర పార్టీల నాయకులు చేస్తున్న విమర్శలు అర్థరహితమని ఆ పార్టీ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన రాహుల్పై ఇతర పార్టీల నేతలు చేస్తున్న విమర్శలను తప్పుపట్టారు. కాంగ్రెస్కు వస్తున్న ప్రజాదరణ చూసి టీఆర్ఎస్, బీజేపీ ఉలిక్కి పడుతున్నాయన్నారు. ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేసేందుకే రాహుల్ గాంధీ పాదయాత్ర చేపడుతున్నారని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ యాత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంప పెట్టుగా మారుతుందని ఆయన విమర్శించారు.
Next Story