చిల్లర కల్యాణ్ అరెస్ట్
మెట్రో రైలు పరిహారం కేసులో డాక్టర్ కవితతో వివాదానికి దిగిన సినీ నిర్మాత చిల్లర కల్యాణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు చెందాల్సిన కోటీ 40 లక్షల రూపాయలను అక్రమంగా తన ఖాతాలోకి మార్చుకోవడాన్ని ప్రశ్నించినందుకు తనపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించాడని సినీ నిర్మాత చిల్లర కల్యాణ్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో డాక్టర్ కవిత అనే మహిళ గతనెల 28న కేసు పెట్టింది. మెట్రో రైల్ నిర్మాణంలో భాగంగా తమ భవనం నష్టపోతున్నందుకు వచ్చిన […]
BY Pragnadhar Reddy6 May 2015 3:35 AM GMT

X
Pragnadhar Reddy6 May 2015 3:35 AM GMT
మెట్రో రైలు పరిహారం కేసులో డాక్టర్ కవితతో వివాదానికి దిగిన సినీ నిర్మాత చిల్లర కల్యాణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు చెందాల్సిన కోటీ 40 లక్షల రూపాయలను అక్రమంగా తన ఖాతాలోకి మార్చుకోవడాన్ని ప్రశ్నించినందుకు తనపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించాడని సినీ నిర్మాత చిల్లర కల్యాణ్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో డాక్టర్ కవిత అనే మహిళ గతనెల 28న కేసు పెట్టింది. మెట్రో రైల్ నిర్మాణంలో భాగంగా తమ భవనం నష్టపోతున్నందుకు వచ్చిన పరిహారాన్ని కల్యాణ్ తన బ్యాంకు ఖాతాలో వేసుకోడానికి ప్రయత్నించాడని, ఈ మొత్తం భవనంలో ఉంటున్న 11 మంది ప్లాట్ ఓనర్లకు చెందినదని, ఈ విషయాన్ని ప్రశ్నించిన తనపై దాడికి పాల్పడ్డాడని, చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించాడని, అడ్డొచ్చిన తన సోదరి, తల్లిని కూడా దుర్భాషలాడాడని ఆమె ఆ కేసులో ఆరోపించారు. మెట్రో రైల్ నుంచి వచ్చిన పరిహారం తమకు సక్రమంగా అందేలా చూడాలని తాము జిహెచ్ఎంసీకి లెటర్ ఇచ్చామని, ఇది తట్టుకోలేని కల్యాణ్ ఫిర్యాదు చేస్తావా అంటూ చెప్పడానికి వీలులేని భాషతో దూషించి, భౌతికంగా దాడి చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. నాలుగొందల మంది జూనియర్ ఆర్టిస్టులని ఇంటి చుట్టూ పెట్టి తనను ఇంట్లోంచి కదలకుండా చేస్తానని బెదిరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొనడంతో కల్యాణ్ని అరెస్ట్ చేయడానికి జూబ్లీహిల్స్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. దీంతో కల్యాణ్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
Next Story