Telugu Global
Others

ప్ర‌భుత్వ‌మే హ‌త్యలు చేయిస్తోంది: జ‌గ‌న్‌

ఏపీ ప్ర‌భుత్వం త‌మ పార్టీ నేత‌ల‌ను ప‌థ‌కం ప్ర‌కారం అధికారుల‌తో క‌లిసి హ‌త్య చేయిస్తోంద‌ని ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఆరోపించారు. ఈ మేర‌కు ఆయ‌న సోమ‌వారం రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. త‌మ పార్టీ నేత‌లే ల‌క్ష్యంగా అధికార ప‌క్షం దాడులు కొన‌సాగిస్తోంద‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు రోజురోజుకు దిగ‌జారుతున్నాయ‌ని గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రించారు. డీజీపీ సొంత‌జిల్లాలోనే 8 హ‌త్య‌లు జ‌ర‌గ‌డం ప‌రిస్థితికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు.  అనంత‌రం మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు డీజీపీతో క‌లిసి […]

ప్ర‌భుత్వ‌మే హ‌త్యలు చేయిస్తోంది: జ‌గ‌న్‌
X
ఏపీ ప్ర‌భుత్వం త‌మ పార్టీ నేత‌ల‌ను ప‌థ‌కం ప్ర‌కారం అధికారుల‌తో క‌లిసి హ‌త్య చేయిస్తోంద‌ని ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఆరోపించారు. ఈ మేర‌కు ఆయ‌న సోమ‌వారం రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. త‌మ పార్టీ నేత‌లే ల‌క్ష్యంగా అధికార ప‌క్షం దాడులు కొన‌సాగిస్తోంద‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు రోజురోజుకు దిగ‌జారుతున్నాయ‌ని గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రించారు. డీజీపీ సొంత‌జిల్లాలోనే 8 హ‌త్య‌లు జ‌ర‌గ‌డం ప‌రిస్థితికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు డీజీపీతో క‌లిసి పోలీసు యంత్రాంగాన్ని వాడుకుని ద‌గ్గ‌రుండి హ‌త్య‌లు చేయిస్తున్నార‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వ ఉద్యోగులు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను ఇందుకు వేదిక‌లుగా ఉప‌యోగించుకుంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
First Published:  4 May 2015 1:01 PM GMT
Next Story