ఎర్రబెల్లి ఓ పెద్ద దద్దమ్మ:: తలసాని విమర్శ
తెలంగాణ తెలుగుదేశం నేత ఎర్రబెల్లి దయాకరరావుపై టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విరుచుకుపడ్డారు. ఆయనో దద్దమ్మ అని, ఎందుకు పనికిరాని వాడని ఆయన అన్నారు. తెలుగుదేశంలో ఇపుడున్న నాయకులంతా కలెక్షన్ కింగ్లేనని, ఎర్రబెల్లి ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివాడని ఆయన విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుంటూ చంద్రబాబును బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటూ ఎర్రబెల్లి పబ్బం గడుపుకుంటున్నాడని తలసాని విమర్శించారు. నిజంగా ఎర్రబెల్లికి చిత్తశుద్ధి ఉంటే ఆయనకు నాయకత్వం ఇచ్చినందుకు […]
BY Pragnadhar Reddy23 April 2015 4:45 AM GMT
X
Pragnadhar Reddy Updated On: 23 April 2015 4:45 AM GMT
తెలంగాణ తెలుగుదేశం నేత ఎర్రబెల్లి దయాకరరావుపై టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విరుచుకుపడ్డారు. ఆయనో దద్దమ్మ అని, ఎందుకు పనికిరాని వాడని ఆయన అన్నారు. తెలుగుదేశంలో ఇపుడున్న నాయకులంతా కలెక్షన్ కింగ్లేనని, ఎర్రబెల్లి ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివాడని ఆయన విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుంటూ చంద్రబాబును బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటూ ఎర్రబెల్లి పబ్బం గడుపుకుంటున్నాడని తలసాని విమర్శించారు. నిజంగా ఎర్రబెల్లికి చిత్తశుద్ధి ఉంటే ఆయనకు నాయకత్వం ఇచ్చినందుకు తెలుగుదేశం పట్ల కృతజ్ఞతతో పడి ఉండాలని, అతని పచ్చి అవకాశవాది అని అన్నారు. చంద్రబాబుకు తెలియకుండా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎందుకు కలిశాడో చెప్పాలని తలసాని డిమాండు చేశాడు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ గెలవాలన్న డిమాండుపై స్పందిస్తూ తాను ఎప్పుడైనా నగరంలో ఎక్కడనుంచైనా గెలుస్తానని అన్నారు. సనత్నగర్ నుంచి మళ్ళీ పోటీ చేయడానికి తాను సిద్ధమేనని, ఒకవేళ అక్కడ ఓడితే రాజకీయ సన్యాసం చేయడానికి కూడా వెనుకాడనని చెబుతూ తనమీద విమర్శలు చేస్తున్న వారు తాను సనత్నగర్ నుంచి గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలని ఆయన సవాలు విసిరారు.
Next Story