Telugu Global
International

ర‌ష్యాలో నౌక మునిగి 54 మంది జల సమాధి

రష్యాలో 54 మంది ఒక్కసారిగా జలసమాధి అయ్యారు. సముద్రంలో వెళుతున్న నౌక దట్టంగా పేరుకుపోయిన మంచుగడ్డలను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. చీక‌ట్లో ప్ర‌యాణిస్తున్న నౌకా సిబ్బంది మంచు అంత ద‌ట్టంగా ఉన్న విష‌యం గుర్తించ‌లేదు. వివరాల ప్రకారం దక్షిణ మగదాన్ కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామ్ చట్కా తీరంలో ది దాల్సి వోస్తోక్ అనే నౌకలో మొత్తం 132 మంది ప్రయాణిస్తున్నారు. ఈ నౌక ఒక్కసారిగా మంచు గడ్లలను ఢీ కొట్టడంతో […]

ర‌ష్యాలో నౌక మునిగి 54 మంది జల సమాధి
X
రష్యాలో 54 మంది ఒక్కసారిగా జలసమాధి అయ్యారు. సముద్రంలో వెళుతున్న నౌక దట్టంగా పేరుకుపోయిన మంచుగడ్డలను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. చీక‌ట్లో ప్ర‌యాణిస్తున్న నౌకా సిబ్బంది మంచు అంత ద‌ట్టంగా ఉన్న విష‌యం గుర్తించ‌లేదు. వివరాల ప్రకారం దక్షిణ మగదాన్ కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామ్ చట్కా తీరంలో ది దాల్సి వోస్తోక్ అనే నౌకలో మొత్తం 132 మంది ప్రయాణిస్తున్నారు. ఈ నౌక ఒక్కసారిగా మంచు గడ్లలను ఢీ కొట్టడంతో త‌ల్ల‌కిందులై పోయింది. ఆ త‌ర్వాత‌ మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న ప్ర‌యాణీకులు 54 మంది నీటిలో మునిగిపోయారు. సమాచారం అందిన వెంటనే సహాయ సిబ్బంది అక్కడికి చేరుకొని 63 మందిని కాపాడగా 54 మంది అప్ప‌టికే జల సమాధయ్యారు. మరో 15 మంది క‌నిపించ‌కుండా పోయారు. ఈ నౌకలో ప్రయాణిస్తున్న వారిలో 78 మంది రష్యన్‌లు కాగా 40 మంది మయన్మార్, ఉక్రెయిన్, లిథువేనియా, వాంచూ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు రష్యా ప్రభుత్వ అధికారులు తెలిపారు.-పీఆర్‌
First Published:  2 April 2015 3:40 AM GMT
Next Story