Telugu Global
NEWS

తాండూరులో లారీ బీభత్సం!

రంగారెడ్డి జిల్లా తాండూరులో ఓ లారీ బీభత్సం చేసింది. తప్ప తాగి ఉన్న డ్రైవర్‌ తాను డ్రైవింగ్‌ సీటులో ఉన్నానన్న థ్యాస మరిచిపోయి రోడ్డుపై విచ్చలవిడిగా లారీని నడిపాడు. దాంతో రోడ్డు మీద ఉన్న జనం కకావికలయ్యారు. అడ్డూ అదుపు లేకుండా నడిచిన లారీ అనేక వాహనాలను ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా ఇద్దరు సీరియస్‌గా గాయపడ్డారు. వీరు చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. వీరే కాకుండా మరో 25 మంది గాయపడ్డారు. […]

రంగారెడ్డి జిల్లా తాండూరులో ఓ లారీ బీభత్సం చేసింది. తప్ప తాగి ఉన్న డ్రైవర్‌ తాను డ్రైవింగ్‌ సీటులో ఉన్నానన్న థ్యాస మరిచిపోయి రోడ్డుపై విచ్చలవిడిగా లారీని నడిపాడు. దాంతో రోడ్డు మీద ఉన్న జనం కకావికలయ్యారు. అడ్డూ అదుపు లేకుండా నడిచిన లారీ అనేక వాహనాలను ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా ఇద్దరు సీరియస్‌గా గాయపడ్డారు. వీరు చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. వీరే కాకుండా మరో 25 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్‌కు తరలించగా... స్వల్పంగా గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేసి పంపించారు.

First Published:  24 March 2015 1:17 PM GMT
Next Story